Telangana

మద్దతు కాదు, సమానత్వం కావాలి

గీతం అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో స్పష్టీకరించిన వక్తలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

మహిళలు సమాజ మద్దతును కాక, పురుషులతో పాటు సమానత్వాన్ని కోరుకుంటున్నట్టు గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం, హైదరాబాదులో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వక్తలు స్పష్టీకరించారు. ‘లాభం కోసం ఇవ్వండి’ (గివ్ టు గెయిన్) అనే ఇతివృత్తంతో గీతం మహిళా సాధికారత సెల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో వింగ్ కమాండర్లు- దుండిగల్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ నుంచి స్నేహ సింగ్, బేగంపేట ఎయిర్ పోర్స్ యూనిట్ నుంచి సహీనా ఖాన్, అరియటిస్ వ్యవస్థాపకురాలు పరిమళ అలమూరి, గీతం పూర్వ విద్యార్థిని-మెర్స్క్ ఇంజనీరింగ్ మేనేజర్ చావలి సుమన వంటి ప్రముఖ వక్తలు పాల్గొన్నారు.చర్చ సందర్భంగా, వింగ్ కమాండర్ స్నేహ సింగ్ మాట్లాడుతూ, మహిళలు తమను సమానంగా చూడాలని, వారి ఆకాంక్షలను నమ్మకంగా కొనసాగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వైమానిక దళంలో చేరాలనే తన నిర్ణయం దృఢ సంకల్పం నుంచి వచ్చిందే తప్ప, ఏదో అవకాశం వచ్చిందని కాదన్నారు.

తన కెరీర్ లో లింగ వివక్షను ఎదుర్కొన లేదని, వృత్తిపరంగా తాను రాణించడానికి ఎందరో పురుష మార్గదర్శులు సహకరించినట్టు సుమన తెలిపారు.సాయుధ దళాలలో విజయం సమష్టి కృషి, వృత్తి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటాయని, అక్కడి బాధ్యతలు లింగభేదాలను చూడవని వింగ్ కమాండ్ సహీనా ఖాన్ చెప్పారు. విషయ నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను పరిమళ నొక్కి చెబుతూ, జ్జానంపై పట్టు గౌరవం, గుర్తింపును పొందుతాయన్నారు. భారతదేశ పురాతన జ్జాన వ్యవస్థల నుంచి నేర్చుకోవాలని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్జానాలను ఉపయోగించి ఆధునిక సందర్భాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాలని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు.

భారత వాయుసేనలో మహిళల అభివృద్ధి చెందుతున్న పాత్ర గురించి స్నేహ మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ దళం పురుషాధిక్యంలో ఉన్నప్పటికీ, యుద్ధ పైలెట్లుగా, సీనియర్ నాయకత్వ పదవులతో సహా మహిళలు ఇప్పుడు గణనీయంగా రాణిస్తున్నట్టు తెలిపారు. అంకితభావం, క్రమశిక్షణ, స్థితిస్థాపకత వ్యక్తులు లింగంతో సంబంధం లేకుండా సవాళ్లను అధిగమించడానికి వీలు కల్పిస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.ప్రేక్షకుల ప్రశ్నలకు ప్యానెలిస్టులు సమాధానమిస్తూ, ప్రజల దృక్పథాలను అర్థం చేసుకోవడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం, స్వీయ-చొరవ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విద్యార్థులు తమ లక్ష్యాలకు బాధ్యత వహించాలని, ఫలితాలను అందించడంపై దృష్టి సారించాలని ప్రోత్సహించారు.

సామర్థ్యం, పనితీరు చివరికి విజయాన్ని నిర్వచిస్తాయన్నారు.ఈ సందర్భంగా, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు మాట్లాడుతూ, గీతం నాయకత్వ పాత్రలలో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు, సీఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ప్రీతి పర్వేకర్ పర్యవేక్షణలో నిర్వహించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కప్ పికిల్ బాల్ పోటీలలో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న బీఆర్క్ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజును సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అల్పాహార విందుతో వేడుకలు ముగిశాయి.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

12 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

12 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

12 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

12 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

22 hours ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago