Telangana

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్ చెరు పట్టణం లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తుండడం మూలంగా చమురు ధరలు పెరిగాయని అన్నారు. వెంటనే అమెరికా యుధోన్మాదాన్ని ఆపాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం 905 రూపాయలు ఉన్న గ్యాస్ కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు పెంచడం మూలంగా 965 రూపాయలకు చేరిందని చెప్పారు. కమర్షియల్ గ్యాస్ పైన 115 రూపాయలు అదనంగా పెంచడం మూలంగా సామాన్య, మధ్యతరగతి ప్రజానికం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్న యుద్ధం విషయంలో, మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మనకు ఆయిల్ నిక్షేపాలు రష్యా నుంచి వస్తున్నాయని, గతంలో ఇరాన్ నుంచి వచ్చేవని ఇరాన్ లో ఉన్న ఆయిల్ నిక్షేపాలను అన్నింటిని అమెరికా హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఆయిల్ నిక్షేపాల విషయంలో ఇప్పటికీ అమెరికా జోక్యంతోనే రష్యాలో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఇరాన్ యుద్ధం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతనం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు ఎండీ వాజీద్ అలీ, పి పాండురంగారెడ్డి, బి పెంటయ్య, జార్జ్, రామకృష్ణ, నారాయణ ఇతరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

24 minutes ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

17 hours ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

17 hours ago

నైపుణ్యాభివృద్ధికి గీతం పెద్దపీట

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…

17 hours ago

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

1 day ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

3 days ago