Telangana

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని, చిట్కుల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ఎదుర్కొని దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబుజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు ఆయన పార్లమెంటు లోపల, బయట నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.దేశం కరువు కాటకాలతో అలమటిస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చూపిన చొరవ అద్వితీయమని మధు ముదిరాజ్ కొనియాడారు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, ఆధునిక సాగు పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని ‘అన్నపూర్ణ’గా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు.

హరిత విప్లవం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన వేసిన పునాదులే నేడు దేశాన్ని ఆహార భద్రతలో అగ్రగామిగా నిలబెట్టాయని స్పష్టం చేశారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం ఇందిరా గాంధీ హయాం నుండి నేటి వరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వెనుక బాబుజీ ఆలోచనా విధానం ఉందని ఆయన గుర్తు చేశారు. కుల మతాలకతీతంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే అసలైన గౌరవమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago