Telangana

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని, చిట్కుల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ఎదుర్కొని దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబుజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు ఆయన పార్లమెంటు లోపల, బయట నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.దేశం కరువు కాటకాలతో అలమటిస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చూపిన చొరవ అద్వితీయమని మధు ముదిరాజ్ కొనియాడారు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, ఆధునిక సాగు పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని ‘అన్నపూర్ణ’గా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు.

హరిత విప్లవం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన వేసిన పునాదులే నేడు దేశాన్ని ఆహార భద్రతలో అగ్రగామిగా నిలబెట్టాయని స్పష్టం చేశారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం ఇందిరా గాంధీ హయాం నుండి నేటి వరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వెనుక బాబుజీ ఆలోచనా విధానం ఉందని ఆయన గుర్తు చేశారు. కుల మతాలకతీతంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే అసలైన గౌరవమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago