మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షునిగా రెడ్యానాయక్ చెల్లదని పత్రికా ప్రకటన ను ఖండిస్తున్నామనీ నడిగడ్డ తాండ వాసులు తెలిపారు.నడిగడ్డ తాండ లో గిరిజన సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు మాత్రమే ఎన్నుకుంటారనీ, కొంతమంది తండా ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత గెలవమని ఉద్దేశంతో అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు గా రెడ్యా నాయక్ అధ్యక్షుడు అని తప్పుడు సమాచారంతో తాండ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తo చేశారు. తాండలో ఎవరు అతనికి ఏకీగ్రీవంగా తీర్మానం చేయలేదనీ, నడిగడ్డ తండాలో 800 కుటుంబాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకుంటారు ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటే భవిష్యత్తులో ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఎవరు ఇలా చేసినా సరైంది కాదని, తప్పుగా ఇచ్చిన పత్రిక ప్రకటనను తండా వాసులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎస్ హన్మ నాయక్, ఎన్ దేవా నాయక్, నాయిని రత్న కుమార్, రమేష్ తేజవత్ బాలు నాయక్ , సోమేశ్ తదితరులు ఖండించారు.నడిగడ్డ తాండ నూతన అధ్యక్షునిగా తండా ఎన్నికల కమిటీ మాత్రమే అధికారికంగా ప్రకటన చేస్తుందనీ, ఎవరు పత్రిక ప్రకటన ఇచ్చిన పూర్తి విషయాలు తెలుసుకొని పత్రిక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…