హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు .ఇప్పటికే రోజు 2లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నామన్నారు. రోజుకు 7, 8లక్షల మందికి వాక్సిన్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు.
ఆరోగ్య శాఖ ఎంతో కష్టపడి వాక్సినేషన్ చేస్తోందని… ఆశ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి సీఎస్ సోమేష్ కుమార్ ధన్యవాదాలు…వాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాద స్థాయి తక్కువగా ఉందన్నారు. టీచర్లకు కూడా ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
30 మొబైల్ వాక్సిన్ వెహికిల్స్ లో వాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాయన్నారు . 18సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా అందజేస్తున్నామన్నారు . వచ్చే నెలలో 2nd డోస్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవడం ద్వారా , వాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా బారినుండి తప్పించుకోవచ్చన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…