హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు .ఇప్పటికే రోజు 2లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నామన్నారు. రోజుకు 7, 8లక్షల మందికి వాక్సిన్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు.
ఆరోగ్య శాఖ ఎంతో కష్టపడి వాక్సినేషన్ చేస్తోందని… ఆశ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి సీఎస్ సోమేష్ కుమార్ ధన్యవాదాలు…వాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాద స్థాయి తక్కువగా ఉందన్నారు. టీచర్లకు కూడా ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
30 మొబైల్ వాక్సిన్ వెహికిల్స్ లో వాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాయన్నారు . 18సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా అందజేస్తున్నామన్నారు . వచ్చే నెలలో 2nd డోస్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవడం ద్వారా , వాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా బారినుండి తప్పించుకోవచ్చన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…