Districts

అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం వాలీబాల్‌ టోర్నమెంట్‌

మనవార్తలు , పటాన్ చెరు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేయడంతో క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగుతున్నారని చిట్కుల్‌ గ్రామసర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామంలో నిర్వహిస్తున్న నీలం మధుముదిరాజ్‌ కబడ్డీ, వాలీబాల్‌ ఛాంపియన్‌ ట్రోపీ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరై  సర్పంచ్ మధు ముదిరాజ్‌ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అనుమతిలో ఓపెన్‌ టు ఆల్‌ టోర్నమెంట్‌ లు గ్రామపరిధిలో భూలక్ష్మి గుడిప్రక్కన నిర్వహిస్తున్నామని సర్పంచ్ మధు ముదిరాజ్‌ తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రతీ ఏడాది ఈక్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు వీటి ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. క్రీడాకారులు ఉన్నతికి తాను ఎప్పుడూ ముందుంటానని  నీలం మధుముదిరాజ్‌ తెలిపారు .

కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి బహుమతిగా 50 వేలు నగదు, రెండవ బహుమతి 25 వేల నగదు, మూడు బహుమతి 10 వేల నగదు, నాల్గవ బహుమతి 10 వేల నగదుతో పాటు ట్రోపీలు అందించనున్నామని తెలిపారు. అలాగే వాలీబాల్‌ పోటీల్లో కూడా మొదటి బహుమతిగా 30 వేల నగదు, రెండవ బహుమతి 15 వేల నగదు, మూడవ బహుమతిగా 5 వేల నగదు, నాల్గవ బహుమతిగా 5 వేల నగదుతో పాటు ట్రోపీలు అందిచనున్నట్లు చెప్పారు. ఈ క్రీడాపోటీల ప్రారంభ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్టువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేష్‌, క్రిష్ణ, భుజగం, శ్రీను, వెంకటేష్‌,ఆంజనేయులు, ఎన్‌ఎమ్‌ఎమ్ యువసేన, గ్రామస్తులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

5 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

8 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago