Telangana

శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు

చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో జ్ఞానవికాసం కలగాలని ఆకాంక్షిస్తూ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు ముత్తంగి శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి దేవిని ప్రత్యేక పూజలతో ప్రార్థించారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిచారు  . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత పంచమి జ్ఞానానికి, సంస్కృతికి ప్రతీక అని, విద్యాభ్యాసం చిన్న వయస్సులోనే ప్రారంభమైతే పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించారు. అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు ఇలాంటి శుభదినంలో విద్యాభ్యాసం ప్రారంభించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.విద్య యొక్క ప్రాముఖ్యతను, భారతీయ సంప్రదాయాల విలువలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago