Telangana

నైపుణ్యాభివృద్ధే భవితకు భరోసా

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ లో నైపుణ్యాభివృద్ధి సాధించాలని, అప్పుడు ఉద్యోగాలే మనను వెతుక్కుంటూ వస్తాయని ఆమ్జెన్ ఇండియా సీనియర్ డేటా సైంటిస్ట్, ఏఐ లీడ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘నేర్చుకోవడానికి, నిర్మించడానికి, వినియోగించడానికి అవసరమైన కృత్రిమ మేధస్సు ప్రాథమికాంశాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.డేటా సైన్స్, అనలిటిక్స్, కృత్రిమ మేధస్సులో దాదాపు 14 ఏళ్లకు పైగా ఆయనకున్న పరిశ్రమ అనుభవాన్ని ఉపయోగించి, ప్రవీణ్ కుమార్ వాస్తవ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు పరిష్కారాలను నేర్చుకోవడం, నిర్మించడం, వినియోగించుకోవడంపై ఆచరణాత్మక విధానాలతో కూడిన విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. పరిశ్రమ అంచనాలు, ఆరోగ్య సంరక్షణ, కేంద్రీకృత కృత్రిమ మేధస్సు వినియోగం, జనరేటివ్ ఏఐలో ఉద్భవిస్తున్న ధోరణులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది విద్యార్థులకు ఆ రంగంలో ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలపై స్పష్టమైన దృక్పథాన్ని ఏర్పరచింది.

ఈ కార్యక్రమంలో గీతం, ఇతర కళాశాలల ఎమ్మెస్సీ డేటా సైన్స్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బీ.ఎం.నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా హాజరయ్యారు. పరిశ్రమ-విద్యా సహకారాన్ని బలోపేతం చేయడంలో గీతం నిబద్ధతను వారు ప్రోత్సహించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని గణిత, గణాంక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి సమన్వయం చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago