Telangana

నైపుణ్యాభివృద్ధే భవితకు భరోసా

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ లో నైపుణ్యాభివృద్ధి సాధించాలని, అప్పుడు ఉద్యోగాలే మనను వెతుక్కుంటూ వస్తాయని ఆమ్జెన్ ఇండియా సీనియర్ డేటా సైంటిస్ట్, ఏఐ లీడ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘నేర్చుకోవడానికి, నిర్మించడానికి, వినియోగించడానికి అవసరమైన కృత్రిమ మేధస్సు ప్రాథమికాంశాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.డేటా సైన్స్, అనలిటిక్స్, కృత్రిమ మేధస్సులో దాదాపు 14 ఏళ్లకు పైగా ఆయనకున్న పరిశ్రమ అనుభవాన్ని ఉపయోగించి, ప్రవీణ్ కుమార్ వాస్తవ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు పరిష్కారాలను నేర్చుకోవడం, నిర్మించడం, వినియోగించుకోవడంపై ఆచరణాత్మక విధానాలతో కూడిన విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. పరిశ్రమ అంచనాలు, ఆరోగ్య సంరక్షణ, కేంద్రీకృత కృత్రిమ మేధస్సు వినియోగం, జనరేటివ్ ఏఐలో ఉద్భవిస్తున్న ధోరణులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది విద్యార్థులకు ఆ రంగంలో ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలపై స్పష్టమైన దృక్పథాన్ని ఏర్పరచింది.

ఈ కార్యక్రమంలో గీతం, ఇతర కళాశాలల ఎమ్మెస్సీ డేటా సైన్స్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బీ.ఎం.నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా హాజరయ్యారు. పరిశ్రమ-విద్యా సహకారాన్ని బలోపేతం చేయడంలో గీతం నిబద్ధతను వారు ప్రోత్సహించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని గణిత, గణాంక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి సమన్వయం చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago