పటాన్ చెరు
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు సర్పంచ్ నీలం మధు కోలాటం ఆడి, నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అందంగా తీర్చిదిద్దిన వాహనంలో డప్పుల చప్పుళ్లు, యువత కేరింతలు, ఆటపాటల మధ్య చిట్కుల్ గ్రామంలోని చెరువుకు తరలించి వైభవంగా అమ్మవారి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, వార్డు సభ్యులు ‘ఎన్ఎంఎం’ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…