పటాన్ చెరు
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు సర్పంచ్ నీలం మధు కోలాటం ఆడి, నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అందంగా తీర్చిదిద్దిన వాహనంలో డప్పుల చప్పుళ్లు, యువత కేరింతలు, ఆటపాటల మధ్య చిట్కుల్ గ్రామంలోని చెరువుకు తరలించి వైభవంగా అమ్మవారి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, వార్డు సభ్యులు ‘ఎన్ఎంఎం’ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…