Categories: politics

గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పని తీరును పరిశీలించి న కేంద్ర బృందం

చిట్కుల్:

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ లో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిశీలనకు తమిళనాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందం పర్యటించింది.

చిట్కుల్ గ్రామంలో లో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయని కమిటీ బృందం సభ్యులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి, కేంద్ర నిధులు ఎలా అందుతున్నాయని, వాటిని ఎలా వినియోగిస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామంలో నర్సరీని, కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ లను, ఉద్యాన వనం పరిశీలించారు.స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు, బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను వివరాలను స్థానికులను అడిగి తెలిపారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సభ్యుల బృందం పర్యటిస్తుందని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ పిచాయ్, డాక్టర్ బాలకృష్ణన్ తెలిపారు. కరోనా అనంతరం ఏపీలో నాలుగు బృందాలు, తెలంగాణలో మూడు బృందాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు . మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయ్ గ్యారెంటీ స్కీమ్,NSDP,వాటర్ షెడ్ ,సడక్ యోజన ,ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ,సడక్ యోజన ,పంచాయతీ రాజ్ యాక్ట్ తదితర పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రేపు మరో రెండు గ్రామాలను సందర్శిస్తామన్నారు.

బృందం సభ్యుల వెంట జిల్లా, మండల అధికారులు, సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. గ్రామంలో కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి పనులను పరిశీలించారని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.చిట్కుల్ గ్రామంలో అభివృద్ధి పనులు బాగున్నాయని కేంద్ర బృందం ప్రతినిధులు కితాబిచ్చినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపిఓ రాజు, శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు, ఏపీఎం శ్రీనివాస్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago