Telangana

సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్షాబంధన్ పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీకి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. విద్యారంగంలోనూ ప్రభుత్వ గురుకుల, కస్తూరిబా గాంధీ విద్యాలయాలను ప్రారంభించడంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సైతం ఓవర్సీస్ స్కాలర్షిప్ ను అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంఈఓ రాథోడ్, మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago