Telangana

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు .

గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మూడు కోట్ల రూపాయల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలియజేశారు . గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ప్రతియేటా నిర్వహించే గీతం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య , ఆర్థికశాస్త్రం , సెన్స్ , సాహిత్యం , లలిత కళలు , ప్రజాసేవ వంటి రంగాలలో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ వివరించారు .

అవార్డు గ్రహీత గురించి :

లాష్ సత్యార్థి ( జననం 11 జనవరి 1954 ) మనదేశంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు విద్యపై సార్వత్రిక హక్కును సమర్థించారు . బాలల ఫౌండేషన్ ( ఎస్సీఎస్ ) ను ఆయన 2004 లో స్థాపించారు . ‘ బచన్ బచావో ‘ ఆందోళనలో కెల్లాస్ , ఆయన బృందం కలిసి మనదేశంలోని 86 వేల మందికి పెగా పిల్లలను బాల కార్మికులు , బానిసత్వం , అక్రమ రవాణాల నుంచి విముక్తి చేశారు . బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1998 లో సత్యార్థి గ్లోబల్ మార్ను రూపొందించి , 103 దేశాలలో , 80 వేల కిలోమీటర్ల సుదీర్ఘ కవాతును నిర్వహించారు . అత్యంత దారుణమైన బాల కార్మికులకు వ్యతిరేకంగా యావత్తు ప్రపంచాన్ని ఒక తాటిపైకి తెచ్చారు . దోపిడీకి గురైన పిల్లల పక్షాన జరిగిన అతి పెద్ద సామాజిక ఉద్యమాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది . ఆయన సేవలకు గుర్తింపుగా , 2014 లో మలాలా యూసఫ్యితో కలిసి నోబెల్ శాంతి బహుమతి సహ – గ్రహీతగా ఎంపికయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళవుతున్న సందర్భంగా , ప్రభుత్వం పిలుపుమేరకు గీతమ్ ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ సంబరాలను నిర్వహించారు . జాతీయ జెండా , ప్లకార్డులను చేబూనిన విద్యార్థులు ర్యాలీ చేసి అందరినీ చెత్తన్యపరిచారు . ఈ ర్యాలీని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ జెండా ఊపి ప్రారంభించగా , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ పర్యవేక్షించారు . సీఎస్ఈ , సివిల్ విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ బి.శివరామకృష్ణ , ప్రసాద్ , పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago