Telangana

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు .

గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మూడు కోట్ల రూపాయల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలియజేశారు . గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ప్రతియేటా నిర్వహించే గీతం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య , ఆర్థికశాస్త్రం , సెన్స్ , సాహిత్యం , లలిత కళలు , ప్రజాసేవ వంటి రంగాలలో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ వివరించారు .

అవార్డు గ్రహీత గురించి :

లాష్ సత్యార్థి ( జననం 11 జనవరి 1954 ) మనదేశంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు విద్యపై సార్వత్రిక హక్కును సమర్థించారు . బాలల ఫౌండేషన్ ( ఎస్సీఎస్ ) ను ఆయన 2004 లో స్థాపించారు . ‘ బచన్ బచావో ‘ ఆందోళనలో కెల్లాస్ , ఆయన బృందం కలిసి మనదేశంలోని 86 వేల మందికి పెగా పిల్లలను బాల కార్మికులు , బానిసత్వం , అక్రమ రవాణాల నుంచి విముక్తి చేశారు . బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1998 లో సత్యార్థి గ్లోబల్ మార్ను రూపొందించి , 103 దేశాలలో , 80 వేల కిలోమీటర్ల సుదీర్ఘ కవాతును నిర్వహించారు . అత్యంత దారుణమైన బాల కార్మికులకు వ్యతిరేకంగా యావత్తు ప్రపంచాన్ని ఒక తాటిపైకి తెచ్చారు . దోపిడీకి గురైన పిల్లల పక్షాన జరిగిన అతి పెద్ద సామాజిక ఉద్యమాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది . ఆయన సేవలకు గుర్తింపుగా , 2014 లో మలాలా యూసఫ్యితో కలిసి నోబెల్ శాంతి బహుమతి సహ – గ్రహీతగా ఎంపికయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళవుతున్న సందర్భంగా , ప్రభుత్వం పిలుపుమేరకు గీతమ్ ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ సంబరాలను నిర్వహించారు . జాతీయ జెండా , ప్లకార్డులను చేబూనిన విద్యార్థులు ర్యాలీ చేసి అందరినీ చెత్తన్యపరిచారు . ఈ ర్యాలీని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ జెండా ఊపి ప్రారంభించగా , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ పర్యవేక్షించారు . సీఎస్ఈ , సివిల్ విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ బి.శివరామకృష్ణ , ప్రసాద్ , పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago