Hyderabad

కిలిమంజారో ని అధిరోహించిన పర్వతారోహకుడు మోతి కుమార్ కు త్రివేణి విద్యా సంస్థల ఘన సత్కారం

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తారీకున దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో కల మౌంట్ కిలిమంజారో ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని మరియు త్రి వేణి విద్యాసంస్థల పతాకాన్ని దానిపై ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంలో స్థానిక త్రివేణి మియాపూర్ ప్రాంగణాల్లో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా మియాపూర్ స్టేషన్ సి.ఐ తిరుపతి రావు, విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి లు హాజరై అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ పర్వతారోహణ చేయటం అనేది అద్భుతమైన పట్టుదల కృషి తో మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా ప్రపంచంలో మరిన్ని పేరెన్నికగన్న పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించి దేశానికి తాను పనిచేస్తున్న సంస్థకు తన జన్మ స్థలానికి మోతి కుమార్ మరింత పేరు తీసుకు రావాలని ని ఆశిస్తున్నానని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ కిలిమంజారో పర్వతారోహణ అనేది పర్వతారోహకుల కళ అని కృషి పట్టుదల నిరంతర శ్రమ తో ఈ ప్రయత్నంలో విజయం సాధించడం మాకు గర్వకారణమని భవిష్యత్తులో మోతి కుమార్ చేసే పర్వతారోహణ యాత్రలో మా విద్యాసంస్థల తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోతి కుమార్ మరిన్ని విజయాలు సాధించాలని మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమాజానికి స్ఫూర్తినిచ్చే పర్వతారోహణ చేసినందుకు మోతి కుమార్ అభినందనీయుడు అని అన్నారు.

ఈ సందర్భంగా మోతి కుమార్ మాట్లాడుతూ నేను తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి ఔత్సా హిక పర్వతారోహకుడు ని. నేను ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుండి ఈ రోజు నా మాతృ గడ్డ తెలంగాణకు వచ్చానని. ఈ సంవత్సరం ఏప్రియల్ 5 న దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారతదేశం పైన నా గౌరవానికి ప్రతీకగా భారతీయ జెండా ని, నేను పనిచేస్తున్న , ఎంతో మంది విద్యార్థులకు 28 సంవత్సరాలుగా నిరంతరాయంగా విద్యా సేవ అందిస్తున్న, త్రివేణి స్కూల్స్ యందు గౌరవసూచకంగా త్రివేణి విద్యాసంస్థల జెండాని ప్రతిష్టించడం జరిగిందని, ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చిన త్రివేణి స్కూల్ యాజమాన్యానికి,డైరెక్టర్ డా.వీరేంద్ర చౌదరి కి, శ్రేయోభిలాషులకు మిత్రులకు నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఏ సి నట్రాజ్, సి ఆర్ ఓ లు సాయి నరసింహారావు వెంకట్రావు ,సుబ్బారావు సత్తుపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ వేణు గోపాల్,విద్యాసంస్థల పీఈటీలు

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

15 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

17 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago