Telangana

వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో  సంగీతం కచేరీ కి నృత్యానికి అద్భుత స్పందన

సునీత ఉపద్రష్ట – శోభన కార్యక్రమాలు హౌస్‌ఫుల్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

నగరం లో గత రెండు రోజులు గా వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో జరిగిన సంగీత కచేరీ కి మరియు నృత్య ప్రదర్శన కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అమెరికాలో విజయవంతమైన ప్రదర్శనల అనంతరం భారతదేశంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వేదం ఆర్ట్ రెండు రోజుల పాటు సంగీతం, సంస్కృతి, నృత్యాన్ని కలగలిపిన అద్భుత కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట టైంలెస్ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. భానుమతి కాలం నుంచి నేటి తరానికి చెందిన పాటల వరకు తెలుగు సినీ సంగీత ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సంగీత విహారం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసింది.ప్రత్యేక ఆకర్షణగా మాయాబజార్ చిత్రంలోని చిరస్మరణీయ గీతాలను పునఃసృష్టించగా, పాడుతా తీయగా చిన్నారులు వేదికపై రేలంగి – సావిత్రి పాత్రలను ఆవిష్కరించడం ప్రేక్షకుల నుంచి ఘన స్పందన అందుకుంది.

గానగంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా ప్రత్యేక విభాగం నిర్వహించగా, ప్రేక్షకులు భావోద్వేగంతో స్పందించారు. చివర్లో పవన్ కళ్యాణ్ పాటల మెడ్లీ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, సాహితి చాగంటి, ధనుంజయ్ తదితర గాయకులు కూడా సునీతతో కలిసి పాల్గొన్నారు.పద్మభూషణ్ శోభన , ఎన్‌సెంబుల్ ప్రదర్శించిన “భావ్” ప్రేక్షకులను విశేషంగా అలరించింది. భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతం, భావ వ్యక్తీకరణ, విజువల్ ప్రెజెంటేషన్‌ల సమ్మేళనంగా రూపొందిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది.హైదరాబాద్‌లో ఒక భరతనాట్యం ప్రదర్శన హౌస్‌ఫుల్ కావడం విశేషమని, ఇది నగరంలో కళల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు తెలిపారు.వేదం తరఫున నిఖిల్ పోలెపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, ఆదరణ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు రెండు గొప్ప కళాకారుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం మా కోసం గర్వకారణం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌కు అత్యుత్తమ సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.ఈ రెండు కార్యక్రమాల విజయంతో వేదం ఆర్ట్ భారతదేశంలో ప్రీమియం లైవ్ ఎంటర్టైన్‌మెంట్ మరియు సాంస్కృతిక వేదికగా తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది.

admin

Recent Posts

పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ కాంట్రాక్టర్ల ‘చలో హైదరాబాద్’ మహాసభ

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు…

2 days ago

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ…

2 days ago

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా,…

2 days ago

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…

3 days ago

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

3 days ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

3 days ago