Telangana

రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రుద్రారం పెద్ద చెరువు ఆయకట్టు గతంలో 250 ఎకరాలకు ఉండేదని, ప్రస్తుతం గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రారం పెద్ద చెరువులో పాశం మైలారం, రుద్రారం లోని ఎంఎస్ఎన్ పరిశ్రమల నుంచి వచ్చే జల కాలుష్యo వలన పూర్తిగా చెరువు కలుషిత జలాలతో నిండిపోయిందని ఆరోపించారు. చెరువులో ఉన్న చేపలు కలుషిత జలాలతో దాదాపు 2000 చేపలు గత రెండు రోజుల్లో చనిపోయాయని, నాలుగు నుంచి ఐదు కేజీల బరువున్న చేపలు, ఇస్నాపూర్ సండే మార్కెట్లో అనేకమంది విక్రయించారని అన్నారు. చేపలు కొన్న అనేకమంది అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. గ్రామంలోని మత్స్యకారుల కుటుంబాలు చేపలు చనిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు నీటిని కలుషితం చేస్తున్న ఎంఎస్ఎన్, హైదరాబాద్ కెమికల్స్, సిరిలియో, అరబిందో ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రుద్రారం పెద్ద చెరువులో బర్రెలు, మేకలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇట్టి విషయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకోసం రుద్రారం పెద్ద చెరువులో మృతి చెందిన చేపల సంఘటనలో విచారణ జరిపించి, కలుషిత జలాలను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత తీవ్రతలను చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,వెంకటేష్, దత్తు లు పాల్గొన్నారు.

admin

Recent Posts

గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు, గుమ్మడిదల మండల…

57 seconds ago

చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన విచారణ జరిపించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో 113 సర్వే నెంబర్ల రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన…

10 minutes ago

గీతంలో మంత్రముగ్ధులను చేసిన మోహినియాట్టం యుగళ నృత్య ప్రదర్శన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన…

13 minutes ago

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

24 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

1 day ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

1 day ago