ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో 113 సర్వే నెంబర్ల రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలి
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన విచారణ జరిపించి,అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న చిన్న కంజర్ల గ్రామ జిపిఓ బండారి రాజును తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు మండలంలోని చిన్నకంజర్ల గ్రామంలో సర్వేనెంబర్ 113 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు పేరుతో గ్రామంలోని రైతుల ద్వారా 185 ఎకరాలను తీసుకుంటుందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం గ్రామసభ నిర్వహించినప్పుడు రైతులకు 28 లక్షల తోపాటు ప్రతి కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రెండు దఫాలుగా 75 ఎకరాలు, మరో 50 ఎకరాలకు గ్రామంలోని రైతులకు 28 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారని, జిపిఓ బండారి రాజు గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో వింగ్ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా లక్షల రూపాయల్లో రైతుల ద్వారా డబ్బులను అక్రమంగా వసూలు చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. రికార్డులను పూర్తిగా తారుమారు చేస్తు రైతులకు నష్టం చేస్తున్నాడని, ప్రతిరోజు మున్సిపల్ వార్డు కార్యాలయం నుంచి తన విధులను నిర్వర్తించవలసి ఉన్న అక్కడి నుంచి తన కార్యకలాపాలను వెంచర్ల లో ఉన్న ఆఫీసుల ద్వారా తన విధులను నిర్వర్తిస్తుంటాడని ఆరోపించారు. గ్రామంలోని ప్రజానీకానికి ఎక్కడ అందుబాటులో ఉండడం లేదని అన్నారు. 113 సర్వే నెంబర్లో పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికి, ఎంజాయ్ మెంట్ పక్కా ఉన్న వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాయకుండా రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవాళ్లుకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నాడని, అనేకమంది రైతుల వద్ద డబ్బులు డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్నారని, ఇట్టి విషయంలో అనేకమంది రైతులు భయాందోళనకు గురై జిపిఓ రాజుకు మధ్యవర్తుల ద్వారా లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారని, గతంలో అనేకసార్లు పై అధికారులకు విన్నవించడం జరిగిందని చెప్పారు. చిన్న కంజర్ల గ్రామ రైతులను పూర్తిగా నట్టేట ముంచుతు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న చిన్న కంజర్ల గ్రామ రెవెన్యూ అధికారి పైన పూర్తిస్థాయి విచారణ జరిపించి, వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, బాబురావు, నల్ల గండ్ల రాజు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు, గుమ్మడిదల మండల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన…
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…