Telangana

గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు, గుమ్మడిదల మండల పరిధిలోగల గ్రామాలలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్‌చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పిఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను తన దృష్టికి తీసుకొని వస్తే  పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే. రాబోయే పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతినెల గ్రామపంచాయతీకి ఆదాయం లభిస్తుందని తెలిపారు.భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు.గుమ్మడిదల మండల పరిధిలోని అనంతరం, కానుకుంట, నూతనకల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి హ్యమ్ ద్వారా నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు డిఈ దీపక్ తెలిపారు. టెండర్లు పూర్తి చేసిన పనులు ప్రారంభించక పోతే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవోలు యాదగిరి, ఉమాదేవి, పిఆర్ డిఈ దీపక్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఏఈ శశిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

admin

Recent Posts

రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ…

16 minutes ago

చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన విచారణ జరిపించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో 113 సర్వే నెంబర్ల రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన…

17 minutes ago

గీతంలో మంత్రముగ్ధులను చేసిన మోహినియాట్టం యుగళ నృత్య ప్రదర్శన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన…

20 minutes ago

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

24 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

1 day ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

1 day ago