మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్’ పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు వాస్తవ-ప్రపంచ సెన్సార్ ఇంటర్ ఫేసింగ్ ను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.స్మార్ట్ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ గేట్ వే సొల్యూషన్స్ వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. అంతేగాక, జాతీయ విద్యా విధానం 2023కు అనుగుణంగా పాఠ్యాంశాలను మెరుగుపరచడం, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ఆవిష్కరణలపై నైపుణ్యం-ఆధారిత విద్యకు ఈ శిక్షణ ఉపకరించనుంది.బెంగళూరులోని పైటెక్ టెక్నికల్ మేనేజర్ గోపాల్, ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ హరీష్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈఈసీఈ అధ్యాపకులు, విద్యార్థులు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు.పైటెక్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి పర్యవేక్షణలో, డాక్టర్ పి.వి. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…