Telangana

తోషిబా కార్మికుని కుటుంబానికి తోటి కార్మికుల అపన్న హస్తం

కూతురి వైద్యం కోసం కార్మికుల ఆర్థిక చేయూత

యూనియన్ అధ్యక్షులు సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కు 7,02,374 రూపాయల చెక్కు అందజేత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆపదలో ఉన్న కార్మికుని కుటుంబానికి తోటి కార్మికులు మేమున్నామంటూ తోడుగా నిలబడి అపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమ యూనిట్ 11లో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు కాప చిరంజీవి కూతురు జోసెలిన్ జాయ్(8) గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతుండడంతో నల్లగండ్ల లోని అమెరికన్ ఒంకాలజి ఇన్స్టిట్యూట్ లో చూపిస్తున్నారు. కాగా వైద్యులు చికిత్స ఖర్చులు చాలా వరకు అవుతాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కార్మికుని కుటుంబానికి తోషిబా యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో కార్మికులంతా మేమున్నామంటు ముందుకు వచ్చి 7,02,374 లక్షల రూపాయలు పోగు చేశారు. చేసిన ఆ అమౌంటును శనివారం పరిశ్రమలో యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ అర్ అనంతరావు యూనియన్ నాయకుల సమక్షములో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ మా అమ్మాయి ఆపరేషన్ కోసం నాతోటి కార్మిక మిత్రులు ముందుకు వచ్చి ఇంత పెద్ద మొత్తం సహాయం అందించిన కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరెడ్డి,తిరుపతి,కే.శ్రీనివాసరెడ్డి,పి. శ్రీధర్,కే సత్యనారాయణ,కే శ్రీనివాస్, ఎల్ కృష్ణయ్య,శ్రీనివాసరెడ్డి,తోషిబా యూనిట్ల కు చెందిన యూనియన్ నాయకులు తదితరు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago