– కూతురి వైద్యం కోసం కార్మికుల ఆర్థిక చేయూత
యూనియన్ అధ్యక్షులు సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కు 7,02,374 రూపాయల చెక్కు అందజేత
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఆపదలో ఉన్న కార్మికుని కుటుంబానికి తోటి కార్మికులు మేమున్నామంటూ తోడుగా నిలబడి అపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమ యూనిట్ 11లో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు కాప చిరంజీవి కూతురు జోసెలిన్ జాయ్(8) గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతుండడంతో నల్లగండ్ల లోని అమెరికన్ ఒంకాలజి ఇన్స్టిట్యూట్ లో చూపిస్తున్నారు. కాగా వైద్యులు చికిత్స ఖర్చులు చాలా వరకు అవుతాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కార్మికుని కుటుంబానికి తోషిబా యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో కార్మికులంతా మేమున్నామంటు ముందుకు వచ్చి 7,02,374 లక్షల రూపాయలు పోగు చేశారు. చేసిన ఆ అమౌంటును శనివారం పరిశ్రమలో యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ అర్ అనంతరావు యూనియన్ నాయకుల సమక్షములో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ మా అమ్మాయి ఆపరేషన్ కోసం నాతోటి కార్మిక మిత్రులు ముందుకు వచ్చి ఇంత పెద్ద మొత్తం సహాయం అందించిన కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరెడ్డి,తిరుపతి,కే.శ్రీనివాసరెడ్డి,పి. శ్రీధర్,కే సత్యనారాయణ,కే శ్రీనివాస్, ఎల్ కృష్ణయ్య,శ్రీనివాసరెడ్డి,తోషిబా యూనిట్ల కు చెందిన యూనియన్ నాయకులు తదితరు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…