Telangana

ర్యాగింగ్ జోలికెళ్లొద్దు…

-అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు

– గీతమ్ లో అవగాహనా వారోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ర్యాగింగ్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.
అందులో భాగంగా, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విద్యార్థులు, ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ విద్యార్థి క్లబ్బుల సభ్యులు ఓపెన్ మెక్ష్, వీథి నాటకం, ఫ్లాషాబ్, నినాదాలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడం వల్ల జరిగే పరిణామాలు, పర్యవసానాలపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

 ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన గీతం హెదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ర్యాగింగ్ నిరోధానికి ఏర్పాటు చేసిన చట్టాలు, యూజీసీ నిబంధనలు, ర్యాగింగ్ను నేరంగా పరిగణించే వివిధ ఐపీసీ సెక్షన్లను వివరించారు. సరదాగా చేసే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, ఒకసారి విద్యార్థి పేరు పోలీసు రికార్డులలో నమోదయితే వారి భవిష్యత్తు అంథకారం అవుతుందని హెచ్చరించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులంతా ఎవరి పరిధి మేరకు వారు ర్యాగింగ్ను నిరోధించాలని, ఏవెనా సంఘటనలు వారి దృష్టికి వస్తే ర్యాగింగ్ నిరోధక బృందానికి తెలియజేయాలని రెసిడెంట్ డెరైక్టర్ సూచించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago