Telangana

ర్యాగింగ్ జోలికెళ్లొద్దు…

-అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు

– గీతమ్ లో అవగాహనా వారోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ర్యాగింగ్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.
అందులో భాగంగా, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విద్యార్థులు, ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ విద్యార్థి క్లబ్బుల సభ్యులు ఓపెన్ మెక్ష్, వీథి నాటకం, ఫ్లాషాబ్, నినాదాలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. ర్యాగింగ్కు పాల్పడం వల్ల జరిగే పరిణామాలు, పర్యవసానాలపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

 ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన గీతం హెదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ర్యాగింగ్ నిరోధానికి ఏర్పాటు చేసిన చట్టాలు, యూజీసీ నిబంధనలు, ర్యాగింగ్ను నేరంగా పరిగణించే వివిధ ఐపీసీ సెక్షన్లను వివరించారు. సరదాగా చేసే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని, ఒకసారి విద్యార్థి పేరు పోలీసు రికార్డులలో నమోదయితే వారి భవిష్యత్తు అంథకారం అవుతుందని హెచ్చరించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులంతా ఎవరి పరిధి మేరకు వారు ర్యాగింగ్ను నిరోధించాలని, ఏవెనా సంఘటనలు వారి దృష్టికి వస్తే ర్యాగింగ్ నిరోధక బృందానికి తెలియజేయాలని రెసిడెంట్ డెరైక్టర్ సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago