మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 153 మంది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ప్రతి అంగన్వాడి ఉపాధ్యాయురాలికి మొబైల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జయరాం నాయక్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : జన గణనలో ప్రతి ఒక్కరూ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: యువ పారిశ్రామికవేత్తగా సాధించిన ఘనతకు గాను, వరల్డ్ వండర్స్ రికార్డ్స్ శ్రీ అబి శ్రీ సత్యం…
మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా…
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ : సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి…
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ…