Telangana

జనగణనలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరుశాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పటాన్‌చెరులోని తన నివాసంలో స్వీయ జన గణనను ప్రారంభించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని.. ఖచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు యాప్ ద్వారా స్వీయ జనగణన సైతం చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇళ్లకు వచ్చిన సమయంలో పూర్తి వివరాలు అందించాలని.. ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి ప్రమాణాలు, వెనుకబాటుతనం, విద్య స్థాయి, తదితర అంశాల పైన స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. ప్రజలు అందించే ప్రతి సమాచారం పూర్తి భద్రతతో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఏ ఆర్ ఓ అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ కాంట్రాక్టర్ల ‘చలో హైదరాబాద్’ మహాసభ

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు…

2 days ago

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ…

2 days ago

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా,…

2 days ago

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…

3 days ago

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

3 days ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

3 days ago