పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం సాయంత్రం 6 గంటలకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించ తలపెట్టిన మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాల ఏర్పాటును పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జాగరణకు హాజరై భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులందరూ సాయంత్రం 6 గంటల లోపు మైత్రి గ్రౌండ్స్ కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవితలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని తెలిపారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రముఖ గాయకుడు గద్దర్ నరసింహ ఆలపించిన గీతాలను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పరమేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, మెరాజ్ ఖాన్, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…