politics

దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశ్ కీ నేతగా, దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ,పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ గా మారాక దేశప్రజలందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుభీమా, రైతుబంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 24 గంటలు కరెంట్ వంటి పథకాలు దేశంలో అమలయ్యేలా చూస్తున్న మహా నాయకుడని అన్నారు. కాళేశ్వరం నీటితో వందల ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి ది అని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క యువత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు దేశానికి ఏం చేస్తారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కష్టాలు కోర్చి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఎన్ఎమ్అర్ యువసేన ఆధ్వర్యంలో రక్తదానశిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పొట్టి నారాయణ రెడ్డి,వెంకటేష్,మురళీ, రాజ్ కుమార్,వెంకటేశ్, ఎండీ ఖదీర్, గారెల మల్లేష్, నారబోయిన శీను, సత్య నారాయణ, మన్నేరాములు,గోపాల్,మహేష్,భాస్కర్, శ్రీనివాస్, రాఘవేంద్ర, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

8 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

8 hours ago

యోగా దినచర్యలో భాగం కావాలి బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా…

13 hours ago

రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50…

13 hours ago

పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ…

13 hours ago

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వందలాది మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా…

13 hours ago