Districts

సమయ పాలనే విజయానికి బాట…సుభాష్ కాకర్ల

మనవార్తలు,పటాన్ చెరు:

సమయ పాలన అంటే , రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుని , సరైన ఫలితాలను సాధించడమని , ఇది అన్ని విజయవంత మైన జీవితాలకు పునాది అని గీతం పూర్వ విద్యార్థి , నిర్వహణా రంగ వృత్తి నిపుణుడు , వక్త , 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తల అవార్డు గ్రహీత సుభాష్ కాకర్ల అన్నారు . గీతం పూర్వ విద్యార్థుల పయనం , వారి అనుభవాలను పంచుకోవడానికి గాను ‘ ట్రెల్ బ్లేజర్స్ ‘ శీర్షికన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లో గురువారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు . ఈ సందర్భంగా సమయ పాలనపై ఓ విద్యార్థి సంధించిన ప్రశ్నకు బదులిస్తూ , ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలే ఉంటాయని , మీరు ఏ విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు , మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎలా పనిచేస్తారు . అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు .

ఇదంతా సాధన ద్వారానే సమకూరుతుందని చెప్పారు . అభిరుచి , వృత్తి నెపుణ్యం , సమయ పాలన , పట్టుదల అనే నాలుగు అంశాలను తాను విశ్వసిస్తానని తెలిపారు . ఓ పనిని ఎంత సమయంలో ముగించాలనే దానిపై స్పష్టత ఉండాలన్నారు . విజయానికి రహస్యం అంటూ ఏదీ లేదని , దానికోసం ఏడడుగులు ఉండవని , అభివృద్ధి వైపు అడుగులేస్తున్న విద్యార్థులంతా నిన్నటి కంటే ఈరోజు కనీసం ఒక శాతమైనా మెరుగ్గా పురోగమించాలని సుభాష్ సూచించారు . ఏదైనా చేయగలననే ధైర్యం ఒక్కసారి వస్తే ఆ వ్యక్తి నాయకుడవుతాడని , కాబట్టి ధైర్యంతో సహజంగా ఏర్పడే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగితే నాయకుడిగా పరిణమించొచ్చని ఓ ప్రశ్నకు బదులిచ్చారు .

కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఆన్లైన్ బోధనలో భౌతిక అనుసంధానం లోపిస్తోందని , దానిని అధిగమించేలా తమని తాము మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు . ఓ బిడియస్తుడిగా గీతమ్ 2013 లో బీటెక్ చేరిన తాను , ఉన్నతాధికారులు , విభాగాధిపతులు , సహాధ్యాయులు , చివరకు అటెండ్ల వరకు ఎంతో పెద్ద కుటుంబాన్ని పొందానని , గీతమే తన ఇల్లుగా సుభాష్ అభివర్ణించారు . ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టాలంటే , ముందుగా మనపై మనకు విశ్వాసం ఉండాలని , ఇతరులపై పెద్దగా ఆధారపడకుండా స్వయం కృషితో దానిని విజయవంతం చేయాలని సలహా ఇచ్చారు . తొలుత , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అతిథిని సత్కరించారు . ఎక్స్టెర్నల్ రిలేషన్స్ డెరైక్టర్ ఆర్కా భట్టాచార్య తన స్వాగతోపన్యాసంలో ఈ ముఖాముఖి లక్ష్యాన్ని వివరించారు . డిప్యూటీ డెరైక్టర్ నవీన్ పినపాత్రుని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago