Districts

రెండు కోట్ల రూపాయలతో తిమ్మక్క చెరువు సుందరీకరణ పనులు

వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

మనవార్తలు ,పటాన్చెరు

పటాన్చెరు పట్టణ పరిధిలోని తిమ్మక్క చెరువును రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 40 లక్షల రూపాయలతో తిమ్మక్క చెరువు చుట్టూ నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు.

ఇందులోభాగంగా తిమ్మక్క చెరువు అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పటికే 30 లక్షల రూపాయలతో చెరువు చుట్టూ ఇనుప కంచె నిర్వహించడం జరిగిందని తెలిపారు. 40 లక్షల రూపాయలతో ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే కోటీ 30 లక్షల రూపాయలతో చెరువు కట్ట పై విద్యుత్ స్తంభాలు, పార్కు, కుర్చీలు, ఆర్చి, తదితర సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే పటాన్చెరు లోని సాకి చెరువు సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి అని తెలిపారు. భవిష్యత్తులో సాకిచెరువు, తిమ్మక్క చెరువులు పటాన్చెరు పట్టణానికి శోభాయమానంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి నీటిపారుదల విభాగం అధికారి శేషగిరిరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ప్రమోద్ గౌడ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

 


55 లక్షల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు డివిజన్ తో పాటు పటాన్చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాండు, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago