మనవార్తలు,సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని వివేకానంద ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించే మెన్స్ డబుల్ ఫస్ట్ ఎడిషన్ వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను పటాన్ చెరు మాజీ సర్పంచ్, వివేకానంద ఇండోర్ స్టేడియం చీఫ్ పట్టర్న్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు శనివారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు గారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు యువకులు చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ క్రీడలను నిర్వహిస్తున్న వివేకానంద ఇండోర్ స్టేడియం అధ్యక్షుడు ది రాజేందర్ ను ఆయన అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో విజేతలకు మొదటి బహుమతి పది వేలు, రెండవ బహుమతి ఐదువేల రూపాయలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చేరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, చందు గారు, అన్వర్ గారు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…