హుజురాబాద్ లో ఓడిపోతామన్న భయంతో టిఆర్ఎస్ నేతలు చిల్లర పనులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం బత్తినివాని పల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజా దీవెన పాదయాత్ర మొదలు పెట్టారు ఈటల. తన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని.ఈ విషయం ఓ మాజీ నక్సలైట్ ద్వారా తెలిసిందన్నారు ఈటల.నాడు నరహంతకుడు నయీమ్ చంపుతా అంటేనే భయపడలేదని..ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అన్నారు.అన్నం పెట్టుకోవడానికి తెచ్చుకున్న సామానులు కూడా తాళం వేశారని.. ఇదేం సంస్కృతి అన్నారు.
దళితబంధును స్వాగతిస్తున్నామని. ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చుడు కాదు..ప్రతి నియోజకవర్గంలోపదివేల మందికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. చల్లా ధర్మారెడ్డి భరతం పడుతామన్నారు ఈటల రాజేందర్. ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం సీఎం కేసీఆర్ కు అలవాటేనన్నారు. హుజురాబాద్ లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని విమర్శించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…