దశాబ్దాలుగా వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బండ్లగూడ వాసులకు త్వరలో ఊరట లభించనుంది. జాతీయ రహదారి నుండి బండ్లగూడ పరిధిలోని మార్క్స్ నగర్ మీదుగా దోషం చెరువు వరకు వరద నీటి మళ్ళింపు కాలువ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ బండ్లగూడ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు. జిహెచ్ఎంసి, టి ఎస్ ఐ ఐ సి అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టాలని సూచించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…