Telangana

పన్ను రేట్లు తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది …

– గీతం జాతీయ సదస్సులో ప్రొఫెసర్ భానుమూర్తి ఉద్ఘాటన

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్జీటీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని , మరీ ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ఎస్ఆర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ సౌజన్యంతో , గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) హెదరాబాద్ లో గురువారం ‘ భారతీయ నేపథ్యంలో సామాజిక – ఆర్థిక రంగాల నుంచి మహమ్మారి – ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు , స్థితిస్థాపకత పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు .

భారత్ పొదుపు – ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని , ప్రపంచంలోని అతిపెద్ద పొదుపుదారులలో ఒకటని , ఇతర దేశాలతో పోలిస్తే మనం ఈ విధంగానే బాగా ఎదుగుతున్నట్టు ఆయన చెప్పారు . కానీ , గత రెండేళ్ళగా , చాలా విధాన నిర్ణయాలు పొదుపుకు వ్యతిరేకంగా ఉంటున్నాయన్నారు . మనదేశం 8 లేదా 9 శాతం వృద్ధిని సాధించాలన్నా , లేదా ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా , స్థూల విధానాలలో పాదుపు అత్యంత ముఖ్యమైనదని , కానీ దాని గురించి ప్రస్తుత విధాన నిర్ణేతలు చాలా తక్కువగా చర్చిస్తున్నారంటూ డాక్టర్ భాను ఆవేదన వ్యక్తం చేశారు . 2003 నాటి ఎస్ఆర్ఎం చట్టాన్ని తిరిగి అమలు చేసేవరకు ప్రజా రుణం 70 లేదా 60 శాతానికి తగ్గడం మనం చూడబోమని ఆయన స్పష్టీకరించారు . పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఆర్ఎం చట్టానికి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు , వాటి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి దారితీస్తోందన్నారు .

దీనికితోడు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పలు రాష్ట్రాలు యోచిస్తున్నాయని , అదే జరిగితే ఇక మన ఆర్థిక వ్యవస్థ గాడిన పడడం కష్టమేనని ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు . ‘ కోవిడ్ మహమ్మారి , అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం , భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు’పై జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజిత్ మజుందార్ కీలకోపన్యాసం చేశారు . సదస్సు నిర్వాహకుడు డాక్టర్ మందార్ వి.కులకర్ణి స్వాగతోపన్యాసం చేయగా , సీఎస్ఓకి చెందిన డాక్టర్ సత్యం సుంకర వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . శుక్రవారం సాయంత్రం వరకు ఈ సదస్సు కొనసాగనుంది .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago