Telangana

శాస్త్రీయతలేని కనీస వేతనాల జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 26వేలకు కనీసవేతనం అమలుచెయ్యాలి

సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శాస్త్రీయత లేకుండా ప్రకటించిన కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు 56 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగా రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యత కోసం ఐక్యత-పోరాటం నినాదంతో 1970 మే 30 న సీఐటీయూ ఆవిర్భవించిందని, కార్మికవర్గ హక్కల రక్షణ కొరకు అనేక ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. కనీస వేతనాలు సవరించాలని గత 15 సంవత్సరాలనుండి పోరాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రస్తుతం అమలవుతున్న వేతనాలకంటే తక్కువగా ప్రకటించి తామేదో కార్మికవర్గాన్ని ఉద్ధరించినట్లు ఆర్భాటపు ప్రకటనలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తక్షణమే కానీసవేతనాల జీవో లను సవరించి విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో శాండ్విక్ యూనియన్ నాయకులు ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివ రెడ్డి, ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

5 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago