Telangana

శాస్త్రీయతలేని కనీస వేతనాల జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 26వేలకు కనీసవేతనం అమలుచెయ్యాలి

సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శాస్త్రీయత లేకుండా ప్రకటించిన కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు 56 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగా రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యత కోసం ఐక్యత-పోరాటం నినాదంతో 1970 మే 30 న సీఐటీయూ ఆవిర్భవించిందని, కార్మికవర్గ హక్కల రక్షణ కొరకు అనేక ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. కనీస వేతనాలు సవరించాలని గత 15 సంవత్సరాలనుండి పోరాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రస్తుతం అమలవుతున్న వేతనాలకంటే తక్కువగా ప్రకటించి తామేదో కార్మికవర్గాన్ని ఉద్ధరించినట్లు ఆర్భాటపు ప్రకటనలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తక్షణమే కానీసవేతనాల జీవో లను సవరించి విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో శాండ్విక్ యూనియన్ నాయకులు ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివ రెడ్డి, ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago