Telangana

జిహెచ్ఎంసి కార్మికుల సేవలు మరువలేనివి _ ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములును, రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు సర్పంచ్ ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు మరువలేనివిగా నిలిచయాన్నారు. సత్తయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామపంచాయతీ, అనంతరం జిహెచ్ఎంసి పరిధిలో నిరంతరం శ్రమించి, పట్టణ శుభ్రత, మౌలిక వసతుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. రాములు నీటిపారుదల శాఖలో పనిచేసే సమయంలో పట్టణ ప్రజలకు నిరంతర నీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.పట్టణంలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తినా, త్వరితగత పరిష్కారం చేసేవారన్నారు. ప్రజా సేవకు ఎనలేని కృషి చేసి, ఒక తల్లి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అలాగే అప్పటి గ్రామపంచాయతీ మరియు జిహెచ్ఎంసి ఉద్యోగులు పట్టణాన్ని ప్రేమగా చూసుకుంటున్నారని కొనియాడారు. వీరి సేవలను గుర్తిస్తూ, సేవా ధృక్పథం కలిగిన ఉద్యోగులు ఎల్లప్పుడూ గుర్తించబడతారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతర జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago