పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములును, రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు సర్పంచ్ ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు మరువలేనివిగా నిలిచయాన్నారు. సత్తయ్య ట్రాక్టర్ డ్రైవర్గా గ్రామపంచాయతీ, అనంతరం జిహెచ్ఎంసి పరిధిలో నిరంతరం శ్రమించి, పట్టణ శుభ్రత, మౌలిక వసతుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. రాములు నీటిపారుదల శాఖలో పనిచేసే సమయంలో పట్టణ ప్రజలకు నిరంతర నీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.పట్టణంలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తినా, త్వరితగత పరిష్కారం చేసేవారన్నారు. ప్రజా సేవకు ఎనలేని కృషి చేసి, ఒక తల్లి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అలాగే అప్పటి గ్రామపంచాయతీ మరియు జిహెచ్ఎంసి ఉద్యోగులు పట్టణాన్ని ప్రేమగా చూసుకుంటున్నారని కొనియాడారు. వీరి సేవలను గుర్తిస్తూ, సేవా ధృక్పథం కలిగిన ఉద్యోగులు ఎల్లప్పుడూ గుర్తించబడతారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతర జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…