బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, ఎం.డి.ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దేవాలయ అధ్యక్షుడు రఘు, మాజీ వార్డ్ మెంబర్ యాదగిరి మరియు గ్రామస్తులు సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక శ్రద్ధను ప్రోత్సహించేలా అన్ని మతాల దేవాలయాల అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. గత మూడు తరాలుగా మా కుటుంబం పేదల అభ్యున్నతికి అంకితభావంతో సేవలందిస్తోంది. ఇళ్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను మా కుటుంబం చేపట్టి ప్రజల సంక్షేమానికి పాటుపడుతోంది. ఇప్పుడు నేనూ మా కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పటాన్చెరు పెద్దల సహకారంతో మరింత సమగ్రంగా ముందుకు సాగుతాను. భవిష్యత్తులో ప్రజలు ఆశించే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని పృథ్వీరాజ్ అన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…