తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలి, కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎం డి ఆర్ ఫౌండేషన్ ను అభినందించారు. తన బాల్యంలో సంక్రాంతి వచ్చిందంటే పండగ ముందు పండగ తర్వాత గాలిపటాలు ఎగురవేస్తూ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వారమని నేటితరం సెల్ ఫోన్, సోషల్ మీడియా మాయలో పడి మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…