మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ మరియు యువజన వికాస సమితి అధ్యక్షులు అడ్వకేట్ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి శివానందం గారు కృషి చేయాలని ఆకాంక్షించారు. గతంలో సర్పంచ్గా పాలన అందించిన అనుభవం ఉన్న శివానందం గారు, ఇప్పుడు పటాన్చెరు లాంటి అతిపెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా, మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించాలని, ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తనను సన్మానించిన మెట్టు శ్రీధర్ మరియు విజయ్ కుమార్ గారికి చైర్మన్ శివానందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్ కమిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…