Telangana

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు గురువారం హృదయపూర్వక వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గీతంతో పాటు, దేశానికి వారు అందించిన ఆదర్శప్రాయమైన సేవ, అంకితభావం, క్రమశిక్షణలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు పట్టభద్రులవుతున్న క్యాడెట్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్.సీ.సీ. శిక్షణ యొక్క నిజమైన విలువ కేవలం ‘సి’ సర్టిఫికేట్ సంపాదించడం వరకే పరిమితం కాదని చెప్పారు. ‘ఇది మీకు స్థైర్యం, క్రమశిక్షణ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ గుణాలే దేశానికి అర్థవంతంగా సేవ చేసేందుకు మీకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని అన్నారు.

రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ గౌరవ అతిథులుగా హాజరై, పట్టభద్రులవుతున్న క్యాడెట్ల అంకితభావాన్ని, వారి సేవను ప్రశంసించారు.ఈ సందర్భంగా, అసోసియేట్ ఎన్.సీ.సీ. ఆఫీసర్ (ఏ.ఎన్.ఓ) లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ తన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, లాంఛనంగా ఆ హోదాను స్వీకరించినందుకు అతిథులు ఆయనను అభినందించి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో, పట్టభద్రులవుతున్న క్యాడెట్లు తమ ఎన్.సీ.సీ. ప్రస్థానం ఎంత గొప్పదో పంచుకోగా, జూనియర్ క్యాడెట్లు తమ కృతజ్జతలు, అభినందనలను తెలియజేశారు. పట్టభద్రులవుతున్న క్యాడెట్లకు జ్జాపికలను అందజేశారు.

ఎన్.సీ.సీ. విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియో, అలాగే మరపురాని క్షణాలను చిత్రీకరించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్, ఈ కార్యక్రమానికి గత స్మృతులను జోడించాయి. క్యాడెట్లు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు, ఆసక్తికరమైన కార్యకలాపాలు ప్రేక్షకుల మన్ననలను పొందాయి.సీనియర్ క్యాడెట్ల వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం గ్రూపు ఫోటో, విందుతో ఈ చిరస్మరణీయ వేడుక ముగిసింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago