శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు గురువారం హృదయపూర్వక వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గీతంతో పాటు, దేశానికి వారు అందించిన ఆదర్శప్రాయమైన సేవ, అంకితభావం, క్రమశిక్షణలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు పట్టభద్రులవుతున్న క్యాడెట్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్.సీ.సీ. శిక్షణ యొక్క నిజమైన విలువ కేవలం ‘సి’ సర్టిఫికేట్ సంపాదించడం వరకే పరిమితం కాదని చెప్పారు. ‘ఇది మీకు స్థైర్యం, క్రమశిక్షణ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ గుణాలే దేశానికి అర్థవంతంగా సేవ చేసేందుకు మీకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని అన్నారు.
రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ గౌరవ అతిథులుగా హాజరై, పట్టభద్రులవుతున్న క్యాడెట్ల అంకితభావాన్ని, వారి సేవను ప్రశంసించారు.ఈ సందర్భంగా, అసోసియేట్ ఎన్.సీ.సీ. ఆఫీసర్ (ఏ.ఎన్.ఓ) లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ తన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, లాంఛనంగా ఆ హోదాను స్వీకరించినందుకు అతిథులు ఆయనను అభినందించి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో, పట్టభద్రులవుతున్న క్యాడెట్లు తమ ఎన్.సీ.సీ. ప్రస్థానం ఎంత గొప్పదో పంచుకోగా, జూనియర్ క్యాడెట్లు తమ కృతజ్జతలు, అభినందనలను తెలియజేశారు. పట్టభద్రులవుతున్న క్యాడెట్లకు జ్జాపికలను అందజేశారు.
ఎన్.సీ.సీ. విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియో, అలాగే మరపురాని క్షణాలను చిత్రీకరించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్, ఈ కార్యక్రమానికి గత స్మృతులను జోడించాయి. క్యాడెట్లు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు, ఆసక్తికరమైన కార్యకలాపాలు ప్రేక్షకుల మన్ననలను పొందాయి.సీనియర్ క్యాడెట్ల వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం గ్రూపు ఫోటో, విందుతో ఈ చిరస్మరణీయ వేడుక ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…