_ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నూతన పే స్కేల్ ను చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా.. పటాన్చెరు నియోజకవర్గ సెర్ప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడదన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టర్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు, లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అభ్యున్నతిని సాధించడంలో సెర్పు ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు. నూతన పే స్కేల్ అమలు చేసి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు శ్రీనివాస్, శివకుమార్, నరేందర్, మధులత, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…