పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతమ్ ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం! ప్రతి ఒక్క పౌరుడూ తమ ఇంటి వద్దే తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, కానీ,దురదృష్టవశాత్తు మనదేశంలో కనీసం 20 శాతం నుంచి కూడా దీనిని ఆచరించడం లేదని అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్-పర్యావరణం డాక్టర్ బీ.ఎన్. మూర్తి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మూర్తి మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను ప్రజలంతా వేర్వేరు.డబ్బాలతో వేయడం ప్రారంభించాలని, తడి వ్యర్థాలను ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం మానేయాలని డాక్టర్ మూర్తి హితవు పలికారు. వ్యర్థ ఆహారాన్ని ప్యాక్ చేసి, సీలు వేయడం వల్ల అది బాగా క్షీణిస్తుందని, దాని నుంచి ప్లాస్టిక్ పదార్థాన్ని వేరుచేయడం కష్టమని ఆయన చెప్పారు. ఈ వ్యర్థాలు నీటిలో చేరి, అవి వినియోగించడానికి నీల్లేకుండా మారడంతో పాటు పర్యావరణానికి చేటు చేస్తోందన్నారు.
తెలంగాణలోని చాలా నీటివనరులు కనీసం స్నానం చేయడానికి కూడా పనిరాని విధంగా తయారయ్యాయని ఆయన విచారం నెలిబుచ్చారు. నీరు, పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి, మార్పును వేగవంతం చేయడానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఎందుకంటే నీరు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుందని, నూర్పు ప్రతి ఒక్కరిలో వచ్చి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అరబిందో పరిశ్రమలో ఆచరిస్తున్న వ్యర్థాల నివారణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.తొలుత, స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ ప్రారంభోపన్యాసం చేసి, అతిథిని సర్కరించగా, కార్యక్రను నిర్వాహకురాలు డాక్టర్ ఆర్.సిసూదేవి నందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులంగా నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. గోడపత్రికల రూపకల్పన, ముఖ చిత్ర లేఖనం వంటి పలు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…