Districts

సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం తథ్యం : జే పీ

పటాన్ చెరు:

ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలైన ప్రజా పాలన , న్యాయం , చట్టాల అమలును మరిచి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం పాలవుతుందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రజా సేవల్లో ప్రభుత్వం పాత్రకె ( రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ) అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , పన్నుల వసూలు చేయడం , డబ్బు పంపిణీ చేయడమే పాలన కాదని ఆయన స్పష్టీకరించారు .

ఇవి పేదరికారిన్న అంతం చేయకపోగా , సమానత్వాన్ని కూడా ప్రోత్సహించలేవని , మానవ గౌరవాన్ని పెంపొందించలేవన్నారు . ఇటువంటి కార్యకలాపాలు ఆయా ప్రభుత్వాలకు ఓట్లను తెచ్చిపెట్టడంతో పాటు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవని స్పష్టీకరించారు . చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం , నిత్య పేదరికం , దోపిడీ , నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించి , ప్రజలకు అందుబాటులో ఉండేలా కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం సమాజాన్ని అధోగతి పాలు చేస్తుందని హెచ్చరించారు .

కల్తీలేకుండా కనీసం ఒక గ్లాసు మంచి తాగునీరు ఇవ్వలేకపోవడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు . నాణ్యమైన విద్య , వైద్యం లేని సమాజం అభివృద్ధి చెందదని , అవి అటు వ్యక్తిగతంగా , ఇటు సమాజపరంగా పురోభివృద్ధికి బాటలు వేస్తాయని , అవి పౌరులందరికీ కల్పించలేకపోతే సమాజం చితికిపోతుందని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు . తొలుత , కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి అతిథిని స్వాగతించగా , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ డాక్టర్ జయప్రకాశ్ను సత్కరించారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago