Districts

సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం తథ్యం : జే పీ

పటాన్ చెరు:

ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలైన ప్రజా పాలన , న్యాయం , చట్టాల అమలును మరిచి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం పాలవుతుందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రజా సేవల్లో ప్రభుత్వం పాత్రకె ( రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ) అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , పన్నుల వసూలు చేయడం , డబ్బు పంపిణీ చేయడమే పాలన కాదని ఆయన స్పష్టీకరించారు .

ఇవి పేదరికారిన్న అంతం చేయకపోగా , సమానత్వాన్ని కూడా ప్రోత్సహించలేవని , మానవ గౌరవాన్ని పెంపొందించలేవన్నారు . ఇటువంటి కార్యకలాపాలు ఆయా ప్రభుత్వాలకు ఓట్లను తెచ్చిపెట్టడంతో పాటు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవని స్పష్టీకరించారు . చట్టాన్ని అమలు చేయని ప్రభుత్వం , నిత్య పేదరికం , దోపిడీ , నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించి , ప్రజలకు అందుబాటులో ఉండేలా కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం సమాజాన్ని అధోగతి పాలు చేస్తుందని హెచ్చరించారు .

కల్తీలేకుండా కనీసం ఒక గ్లాసు మంచి తాగునీరు ఇవ్వలేకపోవడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు . నాణ్యమైన విద్య , వైద్యం లేని సమాజం అభివృద్ధి చెందదని , అవి అటు వ్యక్తిగతంగా , ఇటు సమాజపరంగా పురోభివృద్ధికి బాటలు వేస్తాయని , అవి పౌరులందరికీ కల్పించలేకపోతే సమాజం చితికిపోతుందని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు . తొలుత , కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి అతిథిని స్వాగతించగా , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ డాక్టర్ జయప్రకాశ్ను సత్కరించారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago