డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
పటాన్చెరు
మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తెలిపారు.
సోమవారం పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ తన నామినేషన్ పత్రం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తన నామినేషన్ ను బలపరుస్తున్నారనీ ఫోర్జరీ సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు.
తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ పై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…