డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
పటాన్చెరు
మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తెలిపారు.
సోమవారం పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ తన నామినేషన్ పత్రం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తన నామినేషన్ ను బలపరుస్తున్నారనీ ఫోర్జరీ సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు.
తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ పై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…