politics

మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోండి

డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు

పటాన్చెరు

మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తెలిపారు.

సోమవారం పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ తన నామినేషన్ పత్రం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తన నామినేషన్ ను బలపరుస్తున్నారనీ ఫోర్జరీ సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు.

తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ పై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్

పటాన్‌చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…

1 day ago

వియత్నాం విద్యార్థులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ

బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వియత్నాంలోని…

1 day ago

యాజమాన్యం స్పందించకపోతే సమ్మెను తీవ్రతరం

కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం సిఐటియు…

1 day ago

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈనెల 30న కళాశాలల బహిష్కరణ బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్…

1 day ago

బంజారాహిల్స్‌లో సువర్ణం జ్యువెల్స్ రెండో షోరూమ్ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్‌లో రెండో షోరూమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో…

2 days ago

పార్కులు ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం…

2 days ago