పటాన్చెరు
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా, 35 వేల రూపాయలు ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు సోమవారం ఉదయం కృష్ణ కుటుంబ సభ్యులకు గూడెం మధుసూదన్ రెడ్డి ఎల్వోసీ అనుమతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి, కార్మిక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో సి ఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం లభిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో నియోజక వర్గాన్ని ముందంజలో నిలుపుతున్నట్లు గూడెం మధుసూదన్ రెడ్డితెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రా బిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…
కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం సిఐటియు…
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈనెల 30న కళాశాలల బహిష్కరణ బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్లో రెండో షోరూమ్ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం…