ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్…
పటాన్ చెరు:
ఇద్దరు మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండ్ కు తరలించిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి….
హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన నర్సింలు(34), విజయ్(23) ఇద్దరు వారు పనిచేసే సంస్థ పనిపై సంగారెడ్డి వెళ్లి తిరిగి కొండాపూర్ వస్తుండగా పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గేటు సమీపంలో గుర్తుతెలియని లారీ బుధవారం రాత్రి ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తులో భాగంగా గుర్తుతెలియని లారీ కోసం గాలించారు. ఈ క్రమంలో లారీ ముత్తంగి ఓవర్ పై నుండి శంషాబాద్ వైపు వెళ్తూ శంషాబాద్ రీలింగ్ ఢీకొట్టింది. దీంతో శంషాబాద్ పోలీసులు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ మహదేవ్ అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించి ఉన్నాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పటాన్చెరువు పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్ తరలించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…