Telangana

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి

మృతుల పట్ల పలు అనుమానాలు ?

మనవార్తలు , శేరిలింగంపల్లి:

భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. అంజయ్య స్వామి కూతురు సుజాత (37)ను ఇదే జిల్లాకు చెందిన నాగరాజు(42) కు 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. గత 7 సంవత్సరాల క్రితం భార్యా పిల్లలు సుజాత(37), సిద్దార్థ(11), రమ్యశ్రీ(8) లతో కలసి నగరానికి వలస వచ్చి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 69, ప్లాట్ నెంబర్ 11 లో నివాసం ఉంటున్నారు. నాగరాజు టీవీఎస్ లూనాపై తిరుగుతూ కిరాణా షాపుల్లో మసాలాలు, ఇతర గృహావసర వస్తువులు సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ పనిచేస్తూ డబ్బులు వడ్డీలకు ఇస్తూ ఉంటుందని తెలిపారు.

_ఉరికి వేళాడుతున్న నాగరాజు, హత్యకు గురైన సుజాత, సిద్ధూ, రమ్యశ్రీ

అయితే గత కొన్నాళ్లుగా నాగరాజు సుజాత దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకొని తరుచూ గొడవలు పడే వారని , కొద్ది రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు . శుక్రవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందిని, దీంతో భార్యా పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా భార్యా పిల్లలకు విషమిచ్చి, బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపాడని, అనంతరం తానూ ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ఊరికి కానీ వెళ్తామని ఇటీవల చుట్టూ పక్కల వాళ్ళతో చెప్పారని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తలుపులు మూసి ఉండడం తో ఊరికి వెళ్లి ఉండొచ్చని వారు భావించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఏదో వాసనో స్తుందని అనుమానించిన వారు సోమవారం ఉదయం బయటి వైపు నుండి నిచ్చెన పైకి ఎక్కి కిటికీలో నుండి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ ను పిలిపించి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లొకి ప్రవేశించి ఆధారాలు సేకరించి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య స్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago