Telangana

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘కళాభావన ఆలోచనల కళ’ కార్యశాల

ప్రధాన శిక్షకుడిగా ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిశాంత్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ లో ‘కళా భావన ఆలోచనల కళ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసినట్టు కార్యక్రమ సమన్వయకర్తలు రమ్య గీతిక, ఏ.సంకీర్తన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సృజనాత్మక ఆలోచన, ప్రభావవంతమైన ఆలోచనల అభివృద్ధిపై అవగాహనను మరింతగా పెంచడానికి రూపొందించినట్టు వారు తెలిపారు.ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్, నాగపూర్ లోని ప్రియదర్శిని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్చిటెక్చర్ అండ్ డిజైన్ స్టడీస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిశాంత్ హెచ్ మనాపురే ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించారన్నారు.

ఆర్కిటెక్చరల్ ప్రాజెక్టులపై అవగాహన ఏర్పరచడానికి, వాటిని విజయవంతంగా పూర్తిచేయడానికి శక్తివంతమైన సాధనంగా ‘ఉన్నతంగా ఆలోచించడం’ యొక్క ప్రాముఖ్యతను ప్రొఫెసర్ మనాపురే తొలి రోజు కార్యశాలలో నొక్కి చెప్పినట్టు తెలిపారు. కమ్యూనికేషన్ కళను మెరుగుపరచడంపై దృష్టి సారించి, విద్యార్థులు తమ ఆలోచనలను సమర్థవంతంగా తెలియజేయడానికి వీలు కల్పించిందన్నారు.ఇక రెండవ రోజు, థీసిస్ విద్యార్థుల కోసం రూపొందించిన ఇంటెన్సివ్, యాక్టివిటీ-ఆధారిత సెషన్ అని, ఇందులో ముఖాముఖి చర్చలు నిర్వహించినట్టు తెలియజేశారు.

అస్పష్ట ఆలోచనలను ప్రభావవంతమైన భావనలుగా మార్చడంలో ఇది విద్యార్థులకు ఉపకరించిందన్నారు. ఈ ముఖాముఖి విధానం లోతైన అవగాహనను, అర్థవంతమైన మార్పిడిని పెంపొందించిందని, ఇందులో పాల్గొన్న వారందరి ఆసక్తిని రెట్టింపు చేసినట్టు తెలిపారు.ఈ కార్యశాల ఒక పరివర్తనాత్మక అభ్యాస అనుభవంగా నిరూపితమైందని, విద్యార్థులను విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలు, ఉచ్చారణలో స్పష్టత, వారి సృజనాత్మక దృక్పథాలను ఆచరణలోకి తీసుకురావడానికి ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం చేసినట్టు కార్యక్రమ సమన్వయకర్తలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago