Telangana

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : నీలం మధు ముదిరాజ్

-చిట్కుల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

-సర్వేపల్లి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నీలం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లితో పాటు సావిత్రి బాయి పూలే, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యనే పునాది అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే విద్యార్థిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలరో తెలుసుకుని ఆచరించిన ఆ మహాపురుషుడు జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి తత్వ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఘనత ఆయన సొంతమన్నారు. మహనీయులు సర్వేపల్లి, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago