Telangana

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : నీలం మధు ముదిరాజ్

-చిట్కుల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

-సర్వేపల్లి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నీలం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లితో పాటు సావిత్రి బాయి పూలే, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యనే పునాది అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే విద్యార్థిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలరో తెలుసుకుని ఆచరించిన ఆ మహాపురుషుడు జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి తత్వ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఘనత ఆయన సొంతమన్నారు. మహనీయులు సర్వేపల్లి, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

2 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago