పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని విశ్వ భారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ను తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కరస్పాండెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. భవాని ని, అదేవిధంగా అధ్యాపకుల బృందాన్ని సన్మానించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రవి అనంత మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న స్థానం విలువ ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు రమ్యశ్రీ, కీర్తి, తేజ గురుమూర్తి, తేజశ్రీ, యాష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…