Telangana

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : నీలం మధు ముదిరాజ్

-చిట్కుల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

-సర్వేపల్లి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన నీలం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లితో పాటు సావిత్రి బాయి పూలే, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యనే పునాది అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే విద్యార్థిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలరో తెలుసుకుని ఆచరించిన ఆ మహాపురుషుడు జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి తత్వ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఘనత ఆయన సొంతమన్నారు. మహనీయులు సర్వేపల్లి, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago