_ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 45 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందించే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఖర్చు చేయాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాలని సూచించారు. దీంతోపాటు 9 నూతన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల నిర్మాణ పనుల కోసం 20 లక్షల రూపాయల చొప్పున ఒక కోటి లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…