పటాన్ చెరు
వచ్చేనెల ఆగస్టు 1వ తేదీన పటాన్ చెరు డివిజన్ పరిధిలో బోనాల పండుగ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఉదయం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో బోనాల పండగ పై స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పుర ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఆగస్టు 1న బోనాల పండుగ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు శతాబ్దాలుగా అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవంతో భక్తులు పరవశించిపోతున్నారని, తెలంగాణ సాంస్కృతి వైభవాన్ని ప్రతిభింభించేలా బోనాల ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరిపేలా చూడాలని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, పట్టణ ప్రముఖులు మనోహర్ రెడ్డి, మాణిక్యం, తులసి దాస్, విజయ్ కుమార్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…