పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని ,ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .భక్తులందరూ కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరు కావాలని ఆయన సూచించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సంపూర్ణ సహకారం అందించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…